శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మార్చి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి  సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (మార్చి 27) శ్రీవారిని మొత్తం 64 వేల 97 మంది సందర్శించుకున్నారు.

వారిలో 24 వేల 453 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 72 వేల రూపాయలు వచ్చింది.