రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

 అన్నమయ్య జిల్లాలో  సోమవారం (ఏప్రిల్ 7) జరనిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ మరణించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్‌-2 స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మాదేవి సంఘటనా స్థలంలోనే మరణించారు. మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  రాయ‌చోటి క‌లెక్ట‌రేట్‌లో గ్రీవెన్స్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.  క్ష‌తగాత్రుల‌ను క‌లెక్ట‌ర్ శ్రీధ‌ర్ ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.