నిర్ణయాలన్నీ మన్మోహన్ సింగ్ వే.. దాసరి

జార్ఖండ్‌లోని అమరుకొండ ముర్గా దుంగల్‌ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతోపాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి మంగళవారం ఢిల్లీలోని ఢిల్లీలోని సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం ఏం లేదని.. యుపిఎ ప్రభుత్వ హయాంలో తాను కేవలం సహాయ మంత్రిగా మాత్రమే ఉన్నానని చెప్పారు. అప్పుటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇంచార్జీగా ఉండేవారని.. నిర్ణయాలన్నీ తనే తీసుకునేవారని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu