రిషీకేశ్ టీటీడీ ఆలయంలో దోపిడీ దొంగలు.. గార్డు హత్య...

 

ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేంకటేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయంలో దోపిడీకి ప్రయత్నించినప్పుడు సెక్యూరిటీ విధుల్లో వున్న గార్డు వారిని ప్రతిఘటించాడు. దాంతో ఆ దోపిడీ దొంగలు సెక్యూరిటీ గార్డును హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆలయంలో ఎలాంటి దోపిడీ జరగనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రిషీకేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషీకేశ్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దొంగలు వేంకటేశ్వర ఆలయంలో చోరీకి ప్రయత్నించారు. రిషీకేశ్ ఆలయంలో దోపిడి దొంగల బీభత్సం గురించి తెలుసుకున్న టీటీడీ అధికారులు రిషీకేశ్‌కి బయల్దేరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu