భారత్ లో కరోనా కేసులు.. ప్రతిరోజూ రికార్డే!!

భారత్ లో రోజుకి పదివేల కరోనా కేసులు నమోదవ్వడం కామన్ అయిపోయే రోజులు వస్తున్నాయి. రెండు రోజులుగా పదివేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 9,887 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 294 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6,642 కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,073 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,15,942 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.