టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. అయితే, కొన్ని చోట్ల మాత్రం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇక బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కాంగ్రెస్ అభ్యర్థి కొరకడం కలకలం రేపింది. 32వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును, వేళ్లను కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ కొరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇమ్రాన్ ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.