కేసీఆర్, కవితలకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోస్టర్లు
posted on Dec 4, 2015 2:54PM

తెలంగాణ ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తుందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్, కూతురు కవితల మీద పోస్టర్లు వేయించి కలకలం సృష్టించారు. కేసీఆర్, కవితలు బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారంటూ వారికి వ్యతిరేకంగా వరంగల్ జిల్లా బచ్చన్నపేటలో పోస్టర్లు వేశారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ప్రజల ఆశలను కేసీఆర్ అడియాశలు చేశారని... ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించలేదని వారు ఆరోపించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేకాదు కవితకు భద్రత కూడా పెంచాలని అనుకుంటున్నారట. మొత్తానికి మావోయిస్టులు కేసీఆర్ మీద బానే దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.