ఏపీలో నీటి కొరత లేకుండా చేయడమే లక్ష్యం.. చంద్రబాబు
posted on Jun 26, 2015 5:59PM

ఆంధ్రప్రదేశ్ లో నీటి కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఎన్-1 కన్వెన్షన్ హాల్ లో ఆయన మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ద్వారా వృధాగా పోయే నీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలని అధికారులను సూచించారు. అంతేకాక 22.5 మిలియన్ యూనిట్ విద్యుత్ కొరతను 5 నెలల్లో అధిగమించామని తెలిపారు. పట్టిసీమ ప్రొజెక్టు ద్వారా నీటి కొరత తగ్గుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 టీఎంసీల నీరు తీసుకురాగలమని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ. వై.ఆర్ కృష్ణారావు, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, పరకాల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.