కొట్టుకుంటే సమస్యలు తీరవు.. చంద్రబాబు

ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సూచించారు. అలాకాకుండా కొట్టుకుంటే సమస్యలు తీరవు, కోర్టుల చుట్టూ తిరిగినా ఏమాత్రం ఉపయోగం ఉండదు అందుకే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని అన్నారు. రెండు రాష్ట్రాలకు ఉన్న సమస్యలను అధిగమించి అభివృద్ధి బాటలో నడవాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, దానికి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, తెలంగాణ కూడా దీనికి సహకరించాలని కోరారు. అంతేకాక నీటి విడుదలపై వివాదం తలెత్తినప్పుడు గవర్నర్‌ తో సమావేశమయ్యేందుకు నేనే చొరవ తీసుకున్నా అప్పుడు 'ఏపీకి అన్యాయం జరిగితే ఢిల్లీకి వెళదామని కేసీఆర్‌ కూడా అన్నారు’ అని చంద్రబాబు గుర్తుచేశారు. అదే తరహాలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu