చోటా రాజన్ కు జైలుశిక్ష ఖరారు...

 

నకిలీ పాస్ పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌ను దోషిగా తేల్చుతూ ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. రాజన్ తో పాటు పాస్ పోర్టు అధికారులు దీపక్ నట్వర్ లాల్ షా,  లలిత లక్ష్మణన్, జయశ్రీ దత్తాత్రేయ్ రహతెలను కూడా రాజన్ కు సహకరించారంటూ దోషులుగా ప్రకటించింది కోర్టు. అయితే ఈరోజు వారికి శిక్ష ఖరారు చేసింది కోర్టు. రాజన్‌తో పాటు ముగ్గురికి ఏడేళ్లపాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.15వేలు చొప్పున వారికి జరిమానా కూడా విధించింది.