ఉగాది రోజు  రూ  38 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు 

ఉగాది పర్వ దినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు  తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. పండుగ పూట చేసిన తొలిసంతకం వల్ల 3,456 మంది కుటుంబాల్లో ఆనందం నింపింది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఈ కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రూ 38 కోట్లను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఈ కుటుంబాలకు లబ్ది చేకూరవిధంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు 23, 418 మంది పేద కుటుంబాలను ఆదుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పేదల వైద్యం కోసం రూ, 281. 38 కోట్లు రిలీజ్ చేసినట్టు పేర్కొంది.