శిశుమరణాల రేటు తగ్గించాలి... చంద్రబాబు

 

గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పెంటావాలెంట్ టీకాల వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంటావాలెంట్ వాక్సిన్ కోరింతదగ్గు, ధనుర్వాతం, హైపటైటిస్-బి వంటి వ్యాధుల నుండి కాపాడుతుందని అన్నారు. శిశుమరణాల రేటును తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గర్భిణీలకు అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తున్నామని చెప్పారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, పెళ్లి వయసు విభాగాల్లో వెనుకబడి ఉన్నామని అన్నారు.