రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు కేబినెట్ ఆమోదం

రక్షణ రంగంలోకి ఎఫ్‌డీఐలు వచ్చేశాయి. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రక్షణ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఇక, రైల్వే మౌలిక వసతుల రంగంలో 100% ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, ప్రత్యేక రవాణ లైన్లు.. తదితర వాటిలోకి ఎఫ్ డీఐలు రానున్నాయి. మరోవైపు, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సిఫారసులు చేసే కొలీజియం వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.