రాధాకిషన్ కు ఎస్కార్ట్ తో కూడిన బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి  ఆదివారంరాత్రి మృతి చెందింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ ముఖ్య  భూమిక వహించారు. 
తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు అవకాశమిచ్చింది. కానీ షరతులతో కూడిన బెయిల్ అతనికి మంజూరు చేసింది.  రేపు సాయంత్రం వరకు అతనికి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన తల్లి సరోజినీదేవి ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం ఇచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu