కరోనా ఖతం.. రాందేవ్ బాబా పతంజలి మందు వచ్చింది...

కరోనా వైరస్ కు పతంజలి సంస్థ ఆయుర్వేద మందు తీసుకొచ్చింది. 'కోరోనిల్' పేరుతో మార్కెట్‌లో ఈ ఆయుర్వేద మందును రాందేవ్ బాబా విడుదల చేశారు. ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయొచ్చని అన్నారు. క్లినికల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ మందును తీసుకొచ్చామని రాందేవ్ బాబా చెప్పారు. 'కోరోనిల్' మందు ద్వారా 5 నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేయొచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu