ఏపీ డీజీపీని సాగనంపిన ఎన్నికల కమిషన్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌కి వీర భక్తుడిగా పేరు తెచ్చుకున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణం ఎన్నికల విధుల నుంచి వైదొలగాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గారికి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ బాధ్యతనూ అప్పగించవద్దని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి డీజీపీ ఎంపిక కోసం సోమవారం ఉదయం 11 గంటల లోగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను తమకు పంపాలని ఆదేశించింది. పేర్లను పంపడం మాత్రమే కాకుండా ఈ ముగ్గురికి సంబంధించిన ఐదేళ్ళ కాలానికి సంబంధించిన పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కూడా పంపించాలని సూచించింది. రాజేంద్రనాథ్ రెడ్డి జగన్‌కి విధేయుడిగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ చర్య తీసుకుంది.