ఏపీ సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

ఏపీ‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సీఎస్‌ పదవీకాలాన్ని పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ఏపీ సీఎస్ గా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. 

నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే, కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున ఆమె పదవీ కాలం మరో 6 నెలలు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.