ఎ.పి. అసెంబ్లీలో వసతులు లేవు: ఎమ్మెల్యే

 

 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు రోజులపాటు అసెంబ్లీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన సమవేశమందిరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సమావేశమందిరం కేటాయించలేదని ఆయన అన్నారు. అలాగే ఎమ్మెల్యేలకు సరైన వసతులు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో మంచి అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకుంటామని ఆయన చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu