రోజా పై చంద్రబాబు ఫైర్.. రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు
posted on Dec 18, 2015 4:32PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజా దూకుడిపై మండిపడ్డారు. చంద్రబాబు కాల్ మనీ గురించి ప్రకటన చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయన వద్దకే వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీనికి రోజా ప్రాతినిద్యం వహించడంతో చంద్రబాబు ఆమెపై ఫైర్ అయ్యారు. ఆమె మహిళా? ఒక ఎమ్మెల్యేగా ఆమె మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేకుండా ఆమె చేస్తున్న నినాదాలు ఏంటి అని నిప్పులు చెరిగారు. దీంతో రెచ్చిపోయిన రోజా చంద్రబాబుకు వ్యతిరేకంగా మళ్లీ ఆందోళనలు చేపట్టారు. దీంతో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని మంత్రి యనమల స్పీకర్ ను ప్రతిపాదించగా.. స్పీకర్ కోడెల కూడా ఆయన ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో రోజాను సంవత్సరంపాటు సస్పెండ్ చేశారు.