నైపుణ్యం, జీవనోపాధి పెంచుతాం!

బీసీ కులవృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెరిగేలా అన్ని విధాలుగా చేయూతను అందిస్తామరి ఏపీ మంత్రి సవిత అన్నారు.  బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై అమరావతిలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి సవిత కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో సీడ్ పథకం అమలు చేస్తున్నామన్నామన్నారు. ఏపీలో ఇప్పటికే 6 జిల్లాలో ఈ పథకం అమలు అవుతోందనీ త్వరలో మిగిలిన 20 జిల్లాలో అమలు చేస్తామని చెప్పారు.   100 బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మంత్రి సవిత వెల్లడించారు.