కాంగ్రెస్ ద్రోహి కిరణ్‌కుమార్ ‌రెడ్డి

 

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆ నేరమంతా మోపడానికి ఒక బకరాని వెతికారు. ఆ బకరా పేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరికివారు కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని చెబుతూ పార్టీ హైకమాండ్ దృష్టిలో తమను తాము ఉత్తములుగా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో వున్నారు. తాజాగా ఈ లిస్టులో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా చేరారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలైన ద్రోహి మాజీ కిరణ్ కుమార్ రెడ్డి. పార్టీలో ఉంటూ కీలక పదవులు అనుభవించిన తర్వాత ఎన్నికల సమయంలో పార్టీని వీడిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచారు’’ అని రామచంద్రయ్య విరుచుకుపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu