అగ్రిగోల్డ్ కేసు.. మానవత్వంతో ఆలోచించండి.. హైకోర్టు


అగ్రిగోల్డ్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తి అమ్మకాలకు సంబంధించి సీ1 ఏజెన్సీ 0.5 శాతం కమీషన్ ఇవ్వాలని హైకోర్టును అడిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల సొమ్ము విషయంలో మానవత్వంతో ఆలోచించాలని.. సీ1 ఏజెన్సీకి కమీషన్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే కోల్ కతాకు చెందిన ఎంఎస్టీసీ ఏజేన్సీ కి అప్పగిస్తానన్న హైకోర్టు స్పష్టం చేసింది. కాగా దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సూర్యారావు కమిటీ జనవరి 1 నుండి అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మాలను హైకోర్టుకు సూచించింది. హైకోర్టు కూడా కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu