12 మందిని పొట్టన పెట్టుకున్న కంటైనర్

 

బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపైనుంచి కంటైనర్ దూసుకువెళ్ళడంతో 12 మంది మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు వున్నారు. న్యూఢిల్లీ నుంచి కోల్‌కతా వరకు వున్న నేషనల్ హైవే నంబర్ 2లో ఔరంగాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ‘కన్వారీస్’ అనే పిలిచే శివదీక్షను ధరించిన భక్తులు జార్ఖండ్‌లోని దియోఘర్ దేవాలయానికి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు. రాత్రి సమయం కావడంతో వీరందరూ రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. మంగళవారం తెల్లవారుఝామున వేగంగా ప్రయాణిస్తున్న కంటైనర్ నిద్రిస్తున్న వారి మీద నుంచి దూసుకుపోవడంతో ఈ ఘోరం జరిగింది.