సీమాంధ్రుల శాపం ఎవరెవరికి తగిలిందంటే..

 

 

 

సీమాంధ్రుల శాపం తగిలి మహామహులు ఈ ఎన్నికలలో దుంపనాశనమైపోయారు. రాష్ట్ర విభజన నాటకంలో కొంతకాలం పాత్రని పోషించిన గులాం నబీ ఆజాద్ మటాషైపోయాడు. దగ్గరుండి రాష్ట్రాన్ని ముక్కలు చేయించిన దిగ్విజయ్ సింగ్ ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ రహస్య సంబంధం విషయం బయటపడి చిక్కుల్లో పడ్డాడు. సీమాంధ్రుల విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ షిండే ఘోరంగా ఓడిపోయాడు. విభజన పాపాన్ని మూటగట్టుకున్న చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం ఓటమిని మూటగట్టుకున్నాడు. లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలను చావగొట్టిన అజారుద్దీన్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అధికారం కోసం రాష్ట్రాన్ని విభజించిన సోనియా, రాహుల్ ఇప్పుడు అధికారం కోల్పోయి ఏడుస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu