మోడీ తెదేపాలో చేరుతున్నారు..!

 

ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ ఆప్ పార్టీని వీడి బీజేపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలను తీవ్రంగా ఖండించాడు కుమార్ విశ్వాస్. ఈ నేపథ్యంలో దీనిపై తన ట్విట్టర్లో కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. తాను బీజేపీలోకి వెళుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ పుకార్లని, తాను పార్టీ మారడం లేదని స్పష్టంచేశారు. అంతేకాదు ‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని తెదేపాలో చేరుతున్నారు.. ఇక దీన్ని వార్త చెయ్యండి... కేవలం మీలాగే జోక్‌ చేస్తున్నా’ అంటూ విశ్వాస్‌ వెటకారంగా ట్వీట్‌ చేశారు. అలాగే ‘ప్రధాని సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ పెంచుకోమంటే.. అభిమానులు దాన్ని సెన్స్‌ ఆఫ్‌ రూమర్‌గా తీసుకున్నారు’ అంటూ కూడా ట్విటర్‌లో పేర్కొన్నారు.