బాబు..మగాడివైతే నువ్వు రా
posted on Jun 21, 2013 12:46PM

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు, ఆంధ్రజ్యోతి పత్రికకు తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. తనపై కుట్రతోనే ఆంధ్రజ్యోతి పత్రిక భూదందా వార్తలను ప్రచురించిందని, ఆ పత్రిక పై సోమవారం పరువు నష్టం పిటిషన్ వేస్తానని అన్నారు. తాను ఎలాంటి విచారణకైన సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. చంద్రబాబు, కెసిఆర్ ఆస్తులపై విచారణకు సిద్దంగా ఉన్నామని 'దమ్ముంటే, మగాడివైతే నువ్వు రా.. చంద్రబాబు, కెసిఆర్ పుట్టినప్పటి నుంచి విచారణ జరిపిద్దామా? ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్దమని తమ పార్టీ నేతలు ఎప్పుడో చెప్పారని కెటిఆర్ అన్నారు. లాగు తడుపుకుంటూ పారిపోయే వ్యక్తి చంద్రబాబు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను తప్పు చేసినట్లు తేలితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ చెప్పారు.