హైకోర్టుపై నమ్మకం పోయింది... ఎంపీ కె.కె

 

కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో తెరాస ఎంపీల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎంపీలు కె.కేశవరావు, జితేందర్ రెడ్డి, వినోద్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.కె మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు విభజనపై కేంద్రమంత్రితో చర్చించామని అన్నారు. 15 రోజుల్లో హైకోర్టును విభజించాలని కేంద్రమంత్రిని కోరగా ఆయన దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు పై తమకు నమ్మకం పోయిందని, తెలంగాణ కేసులన్నీ వేరే ఉన్నత న్యాయస్థానానికి తరలించాలని కోరామని చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 31, 32 లో ప్రత్యేక న్యాయస్థానం అంశం ఉందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu