Top Stories

dummy

political-news-img

టీసీఎస్ నాసిక్ కేసు.. మహిళా పోలీసుల ఆపరేషన్ లో బయటపడిన కార్పొరేట్ చీకటి కోణం

నాషిక్ లోని టీసీఎస్ యూనిట్లో జరిగిన ఈ కేసు, భారత కార్పొరేట్ రంగానికి ఒక గంభీర హెచ్చరికగా మారింది.- యువ మహిళా ఉద్యోగులపై లైంగిక దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు, మలేషియా వరకు వెళ్లే హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అనుమానాలు, టెరర్ ఫండింగ్, విదేశీ సంస్థల లింకులుపై కేంద్ర సంస్థల దర్యాప్తు అన్నీ కలిసిన బహుళస్థాయి కేసు ఇది. ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కాదు ్ర నాషిక్ పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి మరీ దర్యాప్తు చేస్తున్న కేసులు. టీసీఎస్ లో ఉద్యోగుల్లా చేరిన మహిళా పోలీసులు. సుమారు ఏడెనిమిది మంది మహిళా పోలీసులు టీసీఎస్ నాసిక్ యూటిన్ లో ఉద్యోగులుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా చేరారు. దాదాపు రెండు మూరు వారాలు.. కొన్ని నివేదిక ప్రకారమైతే 40 రోజులు అక్కడ పని చేసి వర్క్ ప్లేస్ బిహేవియర్ ను నేరుగా గమనించారు. పరిశీలించారు. గూమింగ్, లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ సేకరించారు. ఇది సాధారణ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణ కాదు. పూర్తిగా ప్రణాళికా బద్ధంగా జరిగిన అండర్ కవర్ ఆపరేషన్. ఎఫ్ఐఆర్ లు, కేసులు అండర్ కవర్ టీమ్ నివేదిక ఇచ్చిన తర్వాత మొదటి ఎఫ్ఐఆర్ మార్చి 25న నమోదు అయింది. ఆ తరువాత బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి మరింత మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించారు. ఇప్పటివరకు లైంగిక దాడులకు సంబంధించి 9 ఎఫ్ఐఆర్ లు, మత మార్పిడి ఆరోపణలపై 2ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఇంకా 3 నుంచి 4 FIRలు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే మొదట భయంతో మౌనంగా ఉన్న మరికొన్ని మహిళలు ఇప్పుడు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇది కేవలంఒకటి రెండు సంఘటనలకు మాత్రమే కాదు.. ఒక ప్యాటర్ గా కనిపిస్తున్న కేసుల సిరీస్. మోడస్ ఆపరండి గూమింగ్, మతం పేరుతో బ్రెయిన్ వాష్.. ఆ తర్వాత లైంగిక దుర్వినియోగం. నివేదికలు, డిబేట్ లలో చ్చిన వివరాల ప్రకారం ఇమ్రాన్ అనే ప్రీచర్ వీడియో కాల్స్ ద్వారా కనిపిస్తూ, యువతులతో మాట్లాడి.. వాగ్దానాలు, మతపరమైన మాటలతో బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణ. స్థానికంగాహైచ్ ఆర్, టీమ్ లీడ్ స్థాయిలో ఉన్న కొందరు చిన్న పట్టణాల నుంచి వచ్చిన, అలాగే మొదటి సారి ఉద్యోగంలోకి వచ్చిన యువ హిందూ మహిళలను టార్గెట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మొదట గైడెన్స్, సపోర్ట్, స్పిరిచువల్ కనెక్షన్ పేరుతో దగ్గరై, తర్వాత సైకాలజికల్ ప్రెషర్, గూమింగ్ , లైంగిక దుర్వినియోగం దిశగా వెళ్లినట్లు పోలీసులు, ప్యానెలిస్టులు చెబుతున్నారు. ఇది ఒకే వ్యక్తి చేసిన నేరంలా కనిపించడం లేదనీ, ఒక క్లస్టర్, ఒక నెట్వర్క్, ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ లా కనిపిస్తోందంటున్నారు. మలేషియా ట్రాఫికింగ్ అనుమానం, టెరర్ ఫండింగ్ దర్యాప్తు కొన్ని నివేదికల ప్రకారం బాధితులను మలేషియాకు తరలించే ప్రణాళికలు ఉన్నాయి. బాహ్య సంస్థలు , ఓవర్సీస్ నెట్వర్క లతో లింకులపై దర్యాప్తు జరుగుతోంది. అలాగే టెరర్ ఫండింగ్ కోణం కూడా పరిశీలనలో ఉందని సమాచారం. కేంద్ర సంస్థలు ఈ కేసును సాధారణ కార్యాలయ లైంగిక వేధింపుల కేసుగా కాకుండా.. సంభావ్య ఆర్గనైజ్డ్ నెట్వర్క్ గా చూస్తున్నాయి. ఇది చాలా తీవ్రమైన విషయమనీ, కార్పొరేట్, రాజకీయ బాధ్యత అనీ, దేశానికి అసలేం జరిగింది, జరుగుతోంది అని తెలుసుకునే హక్కు ఉందనీ డిబేట్లలో గట్టిగా చెబుతున్నారు. ఇది టీసీఎస్, టాటా గ్రూప్ లాంటి కంపెనీలో జరిగిందంటే.. టాప్ లీడర్షిప్ పూర్తి వివరాలతో దేశానికి సమాధానం చెప్పాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయంలో చిన్న చిన్న ప్రకటనలు సరిపోవని అంటున్నారు. ఇక పోతే 2022 నుంచే ఫిర్యాదులు ఉన్నాయనీ, అప్పటి ప్రభుత్వాల అపీజ్మెంట్ వల్ల సీరియస్ గా తీసుకోలేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం సిట్ లు, మహిళా కానిస్టేబుళ్లు, కొత్త సిస్టమ్ లతో ఇలాంటి కేసులను బయటకు తీసుకువస్తోందన్న వాదన కూడా ఉంది. అంటే.. ఈ కేసు ఇప్పుడు కార్పొరేట్ బాధ్యత, రాజకీయ బాధ్యతలను గుర్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించిన డిబేట్ లో స్పష్టంగా హిందూ మహిళలను టార్గెట్ చేశారు. మత మార్పిడి ప్రయత్నం చేశారు. అన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే కొందరు దీనిని మతప్రేరేపిత నేరం అంటూ నేరుగా ఆరోపిస్తున్నారు. మరి కొందరైతే స్పష్టంగా ఇస్లాంలో మతమార్పిడి హరామ్ అంటూ.. అటువంటి కన్వర్షన్ లు చెల్లవని కుండబద్దలు కొట్టారు. అయితే.. “ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని బహిరంగంగా ఎందుకు ఖండించడంలోదు, అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డ్ వంటి సంస్థలు ఎందుకు స్పందించడంలేదన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. మహిళల హక్కులు, మిసోజినీ, విక్టిమ్ బ్లేమింగ్. టీవీ డిబేట్లలో కూడా పురుషులు మహిళల మాటలు కట్ చేయడం, మాట్లాడనీయకపోవడం జరిగిందనీ, అదే మైండ్ సెట్ కార్యాలయాల్లో కూడా కనిపిస్తోందనీ అంటున్నారు. మె ఎందుకు నమ్మింది?”, “ఎందుకు వెళ్లింది?” వంటి ప్రశ్నలు విక్టిమ్ బ్లేమింగ్ అన్న విమర్శలను ఖండిస్తూ, అటువంటి తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గూమింగ్, మానసిక ఒత్తిడి, మోసం వంటి క్లిష్టమైన నేరాలను ఆమె తప్పు గా మార్చేప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. మొత్తంగా ఈ కేసులో నిజమైన హీరోయిక్ పాత్ర ఎవరిదైనా ఉందంటే అది నాసిక్ మహిళా పోలీసులదే. అండర్ వర్క్ గా వెళ్లి, పని ప్రదేశంలో కూర్చుని, గూమింగ్, లైంగిక వేధింపు ప్యాటర్న్ ను గమనించి, ఆధారాలు సేకరించి, ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే స్థాయికి తీసుకువచ్చింది వారే. వీరు ఈ ధైర్యం చేయకపోతే.. ఈ కేసు ఒక వదంతిగానే మిగిలిపోయేది. బాధితులు మౌనంగానే ఉండిపోయే పరిస్థితి ఉండేది. కార్పొరేట్ లోపాలు బయటకు రాకపోయేవి స్పేడ్ ఈజ్ స్పేడ్ ఇది ఒక గూమింగ్ గ్యాంగ్ కేసు, కార్పొరేట్ వైఫల్యం, వ్యవస్థకు హెచ్చరిక. నాషిక్ టీసీఎస్ కేసు గురించి ఇప్పటివరకు బయటకు వచ్చినవి ఏమిటంటే.. గూమింగ్, లైంగిక దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు, మలేషియా ట్రాఫికింగ్ అనుమానాలు,టెర్రర్ ఫండింగ్ అనుమానాలు, కార్పొరేట్ వ్యవస్థల వైఫల్యం హెచ్ఆర్, మేనేజ్మెంట్ తీరుపై ప్రశ్నలు, మతపరమైన టెన్షన్, మహిళలపై మిసోజినీ, విక్టిమ్ బ్లేమింగ్, అండర్ వర్క్ మహిళా పోలీసుల సాహసం. వీటన్నిటినీ కలిపి చూస్తే.. ఇది ఒక కార్యాలయానికే పరిమితం చేసే కేసు కాదు. ఇది భారత కార్పొరేట్ ప్రపంచానికి, మహిళల భద్రతకు, మతం పేరుతో దుర్వినియోగం చేసే నెట్వర్క్ లకు, మౌనంగా చూసే వ్యవస్థలకు ఒక హెచ్చరిక.

Publish Date: Apr 17, 2026 6:49PM

political-news-img

సోషల్ మీడియాలో యూఎస్, ఇజ్రాయెల్‌లను ఆడుకుంటున్న ఇరాన్

అమెరికాపై నాన్‌స్టాప్‌ సెటైర్లు వేస్తూ, ఏఐ, లెగో వీడియోలతో ఇరాన్ ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ వర్షన్‌ను కూడా వినాల్సిందేనంటూ ట్రంప్ స్టేట్‌మెంట్లకు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తోంది. అగ్రరాజ్యం సైనిక శక్తి గురించి అందరికి తెలిసిందే. తాము అనుకుంటే చాలు ఏ దేశాన్నైనా నయానో, భయానో తమ దారికి తెచ్చుకోగలమని అమెరికా భావిస్తుంటుంది. అలాంటి అమెరికాకు ప్రస్తుతం ఇరన్ కొరకరాని కొయ్యగా మారింది. యుద్ధంలో మేమే గెలిచాం.. అనుకున్న లక్ష్యాలను సాధించామని అమెరికా చెబుతున్నా.. ప్రపంచం మొత్తం ఈ మాటలను పూర్తిగా నిజమని నమ్మే పరిస్థితి లేదు. దీనికి ఓ కారణం ఉంది. అదే ఇరాన్‌ ఎప్పటికప్పుడు ప్రపంచానికి ఇస్తున్న అప్‌డేట్స్. వార్‌ ఫేర్‌లో అమెరికాను మించిన సైనిక శక్తి ప్రపంచంలో లేదు. ఇది ఎవరు అవునన్నా కాదన్న పూర్తిగా నిజం. కానీ తాము చేసే యుద్ధాలను, దాడులను సమర్థించుకోవడంలో అమెరికా ఎప్పుడూ పైచేయి సాధిస్తుంది. గతంలో గల్ఫ్‌ దేశాలపై అమెరికా చేసిన దాడులను ప్రపంచం మొత్తం సమర్థించింది. కారణం.. అమెరికా ఆ యుద్ధాలు చేయడానికి చూపిన కారణాలు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ప్రపంచానికి చూపించలేదనేది వేరే విషయం. కానీ వెస్ట్రన్ మీడియాలో దానికి సంబంధించిన ఆర్టికల్స్, వీడియోలు వచ్చేవి. వాటినే ప్రపంచం మొత్తం చూసేది. వాటినే తిరిగి రాసేది. ఏది ఏమైనా తాము చేసింది సరైనది అని ప్రపంచానికి బలంగా చూపించేది. దీనికి సంబంధించిన హాలీవుడ్ మూవీస్‌ను తీసి.. తమ వారిని హీరోలుగా చూపించేది. కానీ అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ వార్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా చేసే ప్రకటనలు.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్‌మెంట్‌లకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తోంది ఇరాన్. గతంలోలాగా వన్‌సైడ్ స్టోరీ కాదు.. మా ఆవేదన కూడా వినాలి.. మా వర్షన్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి అంటోంది . ఇందుకోసం సోషల్ మీడియాను తమ అస్త్రంగా మార్చుకుంది. నిజానికి ఇరాన్‌ వెర్షన్‌ను రిపోర్ట్ చేసే మీడియా ప్రస్తుతం లేదు. వారు వారి దేశంలో ప్రసారం చేసుకునే కథనాలు ఎవరూ తిరిగి పబ్లీష్ చేయరు. అందుకే సోషల్ మీడియానే తన అస్త్రంగా మార్చుకుంది. ట్రంప్ ఒక రోజు ఇరాన్‌ను అంతం చేస్తామంటారు.. ఆల్రెడీ అంతం చేసేశాం అంటారు మరోరోజు.. ఇరాన్ తలరాతను మార్చేది తామే అంటారు ఇంకో రోజు.. యుద్ధం కొనసాగుతోందని.. కాదు ముగిసిందని.. ఇరాన్ మేము పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని.. ఇలా అనేక స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీటికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉంది ఇరాన్. దీని కోసం మీమ్స్, ఏఐ వీడియోలను ఆయుధంగా మార్చుకుంది. దీనిని స్లోపాగండా.. లేదా మెమెటిక్ వార్‌ఫేర్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ లెగో స్టైల్ వీడియోలు ఓ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. తాము చెప్పాలనుకున్న విషయాలను సాంగ్స్ రూపంలోనో.. డైలాగ్స్ రూపంలోనో చెప్పేస్తుంది ఇరాన్. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును టార్గెట్‌గా చేసుకుంటుంది ఇరాన్. ట్రంప్ ఏదో టైమ్‌పాస్‌ కోసం యుద్ధం చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని, వారి ఉద్దేశాలను ఎప్పటికప్పుడు వీడియోలతో చెబుతోంది ఇరాన్. అసలు ఈ యుద్ధం చేస్తున్నది అమెరికానే అయినా.. వెనకుండి కథ నడిపిస్తున్నది ఇజ్రాయెల్ అని మొదటి నుంచి ఆరోపిస్తున్నది ఇరాన్. నిజానికి గతంలో ఈ కామెంట్స్‌ను చేసింది. కానీ ఈ మెసేజ్‌ చాలా తక్కువ మందికి రీచ్ అయ్యింది. బట్.. ఒక్క ఏఐ వీడియో ఈ కథను ఇప్పుడు అనేక మందికి చేరవేసింది. ఇరాన్‌ 40 వేల మంది నిరసనకారులను చంపింది అంటూ అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే దీనికి కూడా ఓ వీడియోతో సమాధానం ఇచ్చింది ఇరాన్. అంతేకాదు చంపడం గురించి వస్తే.. మీరు చంపిన వారి సంగతేంటి అంటూ ఇరాన్‌ చేసిన ఓ పోస్ట్‌ అయితే తెగ వైరల్‌గా మారింది. ఇంతేనా హర్మూజ్ జలసంధి మూసేయడంపై వచ్చిన మీమ్స్, ఏఐ వీడియోలు అన్నీ ఇన్నీ కావు. ఓవరాల్‌గా చూస్తే ఇరాన్‌ తన వ్యూహాన్ని మార్చినట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. కేవలం అమెరికా, ఇజ్రాయెల్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ఓ వైపు ట్రేడిషనల్‌ వార్‌ ఫేర్‌ కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో కూడా తమ శత్రుదేశాల మోరల్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. అయితే ఈ వీడియోలలో ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు కొన్ని.. అమెరికన్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు కొన్ని ఇమేజేస్, వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ వీటిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం ఈ వీడియోలు మాత్రం వెస్ట్రన్‌ కంట్రీస్‌లోని జనాలకు మాత్రం రీచ్ అవుతున్నాయి. అమెరికా చెప్పింది మాత్రమే కాదు.. ఈ వెర్షన్ కూడా నిజమే కదా అని ఆలోచించే పరిస్థితి అయితే తీసుకువచ్చింది ఇరాన్. అంతేకాదు అమెరికా రాజకీయాల్లోని అంతర్గత విభేదాలను ఇరాన్ తనకు అనుకూలంగా వాడుకుంటోంది అనేది వాస్తవం. అమెరికాలో యుద్ధ వ్యతిరేక గ్రూపులను, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోస్ట్‌లు పెడుతున్నారు. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, బ్లూ స్కై వంటి ప్లాట్‌ఫామ్‌లలో వేల సంఖ్యలో బాట్ అకౌంట్స్‌ను ఉపయోగించి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తోంది ఇరాన్. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఇరాన్‌ అఫిషియల్ అకౌంట్స్ అంటే ఇరాన్‌ ఎంబసీలు చేసే కొన్ని పోస్ట్‌లు మరింత వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి.

Publish Date: Apr 17, 2026 6:41PM

political-news-img

లోకేష్ ను కరెక్ట్ చేసిన పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యంత సమన్వయంతో సాగుతోంది. మరో పదిహేనేళ్ల పాటు కూటమి పటిష్ఠంగా ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అక్కడక్కడా తలెత్తుతున్న విభేదాలను భూతద్దంలో చూపుతూ ప్రత్యర్థి పార్టీ కూటమి విచ్ఛిన్నం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నారా లోకేష్ గురువారం (ఏప్రిల్ 16) ముఖాముఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తనను ఎలా కరెక్ట్ చేశారో వివరించారు. అదేలా అంటే.. గతంలో ఒక సదస్సులో 2029లో మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు తాను క్షణం కూడా ఆలోచించకుండా నిస్సందేహంగ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే 2029లో కూడా అధికారంలోకి వస్తుందని జవాబిచ్చినట్లు లోకేష్ చెప్పారు. అయితే మరుసటి రోజే తనకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి 2029లో అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పారు. మనం వరుసగా మూడుసార్ల అధికారంలో కొనసాగుతామని చెప్పాలి కదా అని కరెక్ట్ చేశారని లోకేష్ వివరించారు. ఆ సంకల్పంతోనే మనం జనంలోకి వెళ్లాలని జనసేనాని చెప్పారని లోకేష్ వివరించారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా చెప్పడం.. ఆ ఇరువురి నేతల మధ్య బంధాన్ని, పరస్పరం ఉన్న సోదర భావాన్ని తెలియజేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. ఈ ఫోన్ కాల్ పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఉన్నఅనుబంధాన్ని, అలాగే కూటమి ఐక్యతనూ మరోసారి ప్రస్ఫుటం చేసిందన్న చర్చ రాజకీయవర్గాలలో సాగుతోంది. తెలుగుదేశం కూటమి కేవలం పార్టీల మధ్య పొత్తుకే పరిమితం కాలేదనీ, ఆయా పార్టీల నేతల మధ్య కూడా వ్యక్తిగత స్థాయిలో కూడా పటిష్ఠ మైన బంధంగా ఉందనీ తేటతెల్లమౌతోంది. లోకేష్‌కు పవన్ స్వయంగా ఫోన్ చేసి సలహాలు ఇవ్వడం, పవన్‌ను లోకేష్ తన అన్నలా భావిస్తూ ఆ సూచనలను స్వీకరించడం రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిత్రధర్మానికి, పొత్తు ధర్మానికి సరైన మోడల్ గా అభివర్ణిస్తున్నారు. అధికార కూటమి పార్టీలకు చెందిన కీలక, అగ్రనేతలు ఏకతాటిపై ఉండటం పాలనపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందనీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోందనీ అంటున్నారు. రానున్న రోజుల్లో కూటమిలోని పార్టీల మధ్య మరింత సమన్వయం పెరిగేలా ఈ ఇరువునూ ముందుకు సాగుతున్న తీరు పట్ల తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలు తాత్కాలికం కావని, సుదీర్ఘ ప్రయాణానికి పునాదులని ఈ ఇరువురూ విస్పష్టంగా చాటుతున్నారు.

Publish Date: Apr 17, 2026 6:09PM

political-news-img

పీవీ సింధుతో షటిల్ ఆడిన మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధికి ఊపందించే దిశగా మంత్రి నారా లోకేష్ కీలక అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ పీ.వి. సింధుతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడి ఆకట్టుకున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ సరదా మ్యాచ్‌లో లోకేష్ చురుకైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి గొల్లవానిగుంటలో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన అనంతరం, లోకేష్ క్రీడాకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. క్రీడాకారులు, నిపుణుల సూచనలు తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతానన్న హామీ త్వరలో కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, అథ్లెట్ యర్రాజీ జ్యోతి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్తో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే బ్లైండ్ క్రికెట్, పారా స్పోర్ట్స్, చెస్, ఆర్చరీ, హాకీ, ఖోఖో వంటి విభిన్న క్రీడల ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. క్రీడాకారుల సూచనలన్నింటినీ డాక్యుమెంటేషన్ చేసి, 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, ప్రతిభకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

Publish Date: Apr 17, 2026 6:07PM

political-news-img

కిడ్నీ ఫెయిల్యూర్.. మీరు తినే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి!

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు (Kidney Issues). కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. సరైన డైట్ పాటించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా నియంత్రించవచ్చు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. అరవింద్ రెడ్డి (Dr. B Aravind Reddy) ఈ వీడియోలో కిడ్నీ రోగులు పాటించాల్సిన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. ఈ వీడియోలోని ముఖ్య అంశాలు: తినవలసిన ఆహారం: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి? నియంత్రించాల్సిన పదార్థాలు: ఉప్పు, పొటాషియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎందుకు తగ్గించాలి? నీటి వినియోగం: కిడ్నీ రోగులు రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగాలి? పిల్లల కోసం ప్రత్యేక జాగ్రత్తలు: చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన డైట్ జాగ్రత్తలు. నిత్య జీవిత మార్పులు: ఆహారంతో పాటు జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటి? మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు డయాలసిస్ వంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి డాక్టర్ గారు చెప్పిన ఈ సూచనలను తప్పక పాటించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Apr 17, 2026 5:56PM

political-news-img

మంగ్లీ, సుబ్బారావు ఫిర్యాదులపై కేసు నమోదు చేసాం : పంజాగుట్ట సీఐ

హైదరాబాద్ నగరంలో ఫోక్ సింగర్ మంగ్లీ వివాదం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే ఈ ఘటనపై పంజాగుట్ట సీఐ వివరణ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిందంటూ న్యాయవాది సుబ్బారావు మంగ్లీ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అయితే వెనువెంటనే మంగ్లీ కూడా సుబ్బారావు మీద పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట సీఐ రామకృష్ణ తెలిపారు. అయితే ఈ చీటింగ్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రధానంగా బెదిరింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా న్యాయవాది సుబ్బారావు మద్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లుగా అనుమానం రావడంతో న్యాయవాది సుబ్బారావును పోలీసులు తనిఖీ చేశారని చెప్పారు... అంతేకాకుండా న్యాయవాది సుబ్బారావు అదే సమయంలో సరైన ఆధారాలు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ ఎదుట న్యూసెన్స్ సృష్టించడం సృష్టించినందుకు కూడా అతనిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా మరోవైపు మైక్రో ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి రావడంతో సైబరాబాద్ పోలీసులు నిన్న రమావత్ మధును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు పంజాగుట్ట సీఐ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్వకేట్ సుబ్బారావుకు బలవంతంగా బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. బాధితుల పక్షాన ఉన్న లాయర్‌ను ఇలా చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. సదరు సీఐతో పాటు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Publish Date: Apr 17, 2026 5:36PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img