అర్ధరాత్రి యోగి సంచలన నిర్ణయం..

 

ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న సీఎం యోగి ఆధిత్యనాథ్ రాత్రికి రాత్రే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఐపీఎస్‌ ఆఫీసర్లను బదిలీ చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిపోయింది. దీంతో 41 జిల్లాల పోలీసు బాస్‌లను, ఇతర ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగులను చేపట్టారు. ముఖ్యంగా  మెయిన్పురి, నోయిడా, ఆగ్రా, సహారన్పూర్, అమ్రోహ, గోరఖ్పూర్, డియోరియా,కన్నౌజ్ జిల్లాల ఎస్ఎస్‌పీలను బదిలీ  చేసింది.