విశాఖలో వైసీపీ మహాధర్నా

విశాఖపట్నంలో వెలుగుచూసిన భూముల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ "సేవ్ విశాఖ" పేరిట మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ దీక్షలో పాల్గొనేందుకు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యక విమానంలో విశాఖ చేరుకున్న ఆయనకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు.