ఉన్నావ్ రేప్ కేసు... బీజేపీ ఎమ్మెల్యేకి షాక్..

 

యూపీ ఉన్నావ్ రేప్ కేసు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షాక్ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు యోగి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఉన్న  ‘వై’ కేటగిరీ భద్రతను తొలగించింది. ఉన్నావ్ జిల్లా బంగర్మావ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఇప్పటిదాకా ఇద్దరు కమెండోలు, పోలీసులు సహా మొత్తం 11 మందితో ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. అయితే ఇప్పుడు ఈ కేసు నేపథ్యంలో  ఆయన భద్రతను తొలగించేశారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే కుల్దీప్ సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. సీబీఐ అధికారులు ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేశారు.