ముందు మీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించండి పవన్.. ఎమ్మెల్సీ స్ట్రాంగ్ కౌంటర్
posted on Aug 3, 2020 4:43PM
ఏపీలో మూడు రాజధానుల అంశం పై రచ్చ మాములుగా లేదు. ఈ విషయం పై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసిపి, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు అయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినఅయన ఈరోజు అమరావతికి చేరుకొని అక్కడ అదేక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానులను నిరసిస్తూ తాను ఇప్పటికే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించానని అంతే కాకుండా ఛైర్మన్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నానని అయన తెలిపారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారని ఐతే ముందుగా జనసేన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని అయన అన్నారు. అంతే కాకుండా అమరావతి విషయంలో పవన్ స్టాండ్ ఏమిటో కూడా స్పష్టం చేయాలని అయన డిమాండ్ చేశారు.