చిన్నారి కోసం రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు సహాయకచర్యలను మరింత ముమ్మరం చేశారు అధికారులు. బాలిక బోరుబావిలో పడి 38 గంటలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో నిపుణులు రప్పిస్తున్నారు. దీనిలో భాగంగా ఓఎన్‌జీసీ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. వారు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పాపను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.