మరోసారి రజనీ పై స్వామి సెటైర్లు.. 'చదువురాని' వ్యక్తుల అవసరం లేదు...

 

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ రాజకీయాలను పనికిరాడని... ఆయనకు రాజకీయాల్లో భవిష్యత్తు లేదని అన్నారు. అయితే ఇప్పుడు మరోసారి రజనీకాంత్ పై మండిపడ్డారు.  రాజ‌కీయాల్లో 'చదువురాని' వ్యక్తుల అవసరం ఉండదని, త‌మిళ‌నాడు రాజకీయాలకు రజనీ ఏ మాత్రం సరిపోరని అన్నారు. ర‌జ‌నీకి అస‌లు రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల వంటివి తెలియ‌వ‌ని..ఆయన సినిమాలకి పరిమితమైతేనే బాగుంటుంద‌ని, ఆయ‌న బాగా డైలాగ్‌లు చెప్పగలుగుతారని చెప్పారు.