నేడు సింగపూర్ మంత్రితో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం
posted on Jul 20, 2015 7:21AM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రణాళికను తయారుచేసిన సింగపూర్ సంస్థల బృందం, ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ తో కలిసి నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకొన్నారు. వారు ఈరోజు రాజమండ్రి చేరుకొని రాజధాని ప్రధాన నగరం యొక్క బృహత్తర ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేస్తారు. అనంతరం వారు ఆయనతో కలిసి సాయంత్రం 4 గంటలకు షెల్టాన్ హోటల్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. మూడు రోజుల క్రితం వారు విడుదల చేసిన రాజధాని నగర ఊహాచిత్రాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈరోజు మీడియా సమావేశంలో వారు రాజధాని గురించి మరిన్ని ఆసక్తికరమయిన విశేషాలు, వివరాలు ప్రజలకు తెలియజేయవచ్చును. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాలను స్వయంగా పర్యవేక్షించేందుకు రాజమండ్రిలో బస చేసి ఉన్నందున వారు అక్కడికే వచ్చి రాజధాని ప్రణాళికను అందజేయాబోతున్నారు. ఈ సందర్భంగా వారు పుష్కరాలు జరుగుతున్న తీరును కూడా పరిశీలించే అవకాశం ఉంది.