రేవంత్ కు ధైర్యం చెప్పిన ఖైదీలు
posted on Jul 20, 2015 12:38PM

తెదేపా ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి నెల రోజులు జైలులో ఉన్న సంగతితెలిసిందే. కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి అక్కడి ఖైదీలే ధైర్యం చెప్పారంటూ.. ఈవిషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డినే చెప్పారు. అంతేకాదు ఇంకా పలు రకాల ఆసక్తికర విషయాలు చెప్పారు రేవంత్ రెడ్డి. జైలులో తనకు వంట మనిషికా నాగయ్య అనే ఖైదీని నియమించారని.. అతను చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని వెల్లడించారు. మీలాంటి వాళ్లు ఇంత దూరం రాకూడదు.. జైలుకే వచ్చారు ఇంకా కేసీఆర్ మిమ్మల్ని ఏం చేస్తాడు? ఏదైతే అది జరుగుద్ది అని ధైర్యం చెప్పారంటా. 'సావుకు మించిన ధైర్యం లేదు. గోసిగుడ్డకు మించిన దరిద్రం లేదు.. ఇంత దూరం వచ్చిన మిమ్మల్ని కేసీఆర్ ఏం చేయలేడని చెప్పారంటా.