బీజేపీ పనైపోయింది...లోకేష్ అవినీతి కనిపిస్తోంది..

 

మరోసారి బీజేపీ, టీడీపీ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన... బీజేపీతో కలసి పని చేసే అవకాశమే లేదని.. ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ... ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ పూర్తిగా కోల్పోయిందని... ఏపీలో బీజేపీ ఇమేజ్ పూర్తిగా నెగెటివ్ గా ఉందని... బీజేతో పొత్తు పెట్టుకోవాలని ఎవరూ భావించడం లేదని అన్నారు. అంతేకాదు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అవినీతి గురించి పవన్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో...లోకేష్ అవినీతికి పాల్పడినట్టు చేసిన ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా?  అని అడుగగా... దానికి సమాధానం చెబుతూ.. లోకేష్ అవినీతి బహిరంగంగా కనిపిస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును... ప్రైవేట్ కాంట్రాక్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని అన్నారు.