వాళ్లను బచ్చాగాళ్లనడం సరికాదు... నాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత నాగం జానార్ధన రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి దక్కిందంటే అది ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధుల పోరాటాల ఫలితమేనని ఎద్దేవా చేశారు. అలాంటి విద్యార్ధులను కేసీఆర్ బచ్చాగాళ్లనడం సబబు కాదని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్దమవుతాడని నాగం హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని, ఓయూ అంటేనే పోరాటాల గడ్డ అని అన్నారు. 1969 నుంచి ప్రత్యేక రాష్ట్ర కోసం ఎంతో పోరాడి తెలంగాణ పురిటి గడ్డగా మారిందని గుర్తుచేశారు.