కేరళాలో మోడీ.. నన్ను క్షమించండి..!
posted on Dec 15, 2015 1:57PM

ప్రధాని నరేంద్రమోడీ కేరళ వాసులకు క్షమాపణ చెప్పారు. మోడీ ఎందుకు క్షమాపణ చెప్పారు అనుకుంటున్నారా..కేరళ పర్యటనలో భాగంగా త్రిసూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు19 నెలలు అయిన తరువాత మొదటిసారి కేరళకు వచ్చానని..అందుకే క్షమాపణ కోరుతున్నానని అన్నారు.అంతేకాదు కేరళలో ఉన్న జీజేపీ నేతలను ఆయన కొనియాడారు.కేరళలో ఉన్న బీజేపీ నేతలకు ఎంతో సహనం ఉంది అందుకే వారిని సహనశీలురుగా అభివర్ణిస్తున్నానని అన్నారు.కేరళ బీజేపీ కార్యకర్తల నుండి ఎంతో నేర్చుకోవాలి..కొంతమంది రాజకీయ ప్రేరేపిత చర్యల వల్ల సుమారు 200మంది బీజేపీ కార్యకర్తలు దారణ హత్యకు గురయ్యారు..అయినా కానీ ఎక్కడా సహనం కోల్పోకుండా ప్రతిచర్యలకు దిగకుండా ఉన్నారు అని వారిని ప్రశంసించారు.కానీ ఇప్పుడు అలా కాదు..పరిస్థితులు మారాయి..కార్యకర్తల కృషితో కేరళలో బీజేపీకి ఆదరణ పెరిగింది. ప్రజలు మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు'అంటూ వ్యాఖ్యానించారు.