నాకు జోతిష్యం తెలుసు... మోడీ పదవి పోతుంది..

 

ప్రధాని నరేంద్ర మోడీపై లాలూ ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజాగా మరోసారి మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇటీవల లాలూకు సంబంధించిన 22 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై లాలూను మీడియా ప్రశ్నించగా.. ఒక్కసారిగా కోపాద్రిక్తుడైన ఆయన ఏ 22 చోట్ల సోదాలు చేశారో తనకు చెప్పాలని, ఆ ప్రాంతాలు ఏంటని ఆయనే ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆయన ప్రధాని మోడీపై కూడా విరుచుకుపడ్డారు. తనకు జ్యోతిష్యం బాగా తెలుసని, మోదీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేయబోదని.. త్వరలోనే అధికారం కోల్పోతుందని అన్నారు.