బాంబు పెట్టబోయాడు.. పేలింది.. పోయాడు..
posted on Apr 17, 2015 2:44PM

ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ ఇటీవలి కాలంలో బాగా వేళ్ళూనుకుని ఎంతోమందిని చంపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ చీఫ్ హఫీజ్ మహ్మద్ సయీద్ బాంబు పేలుడులో మరణించాడు. ఈయనగారు వాయవ్య పాకిస్థాన్లోని తిరాహ్ లోయలో రోడ్డు పక్కన బాంబు పాతిపెడుతూ వుండగా అది అతని చేతిలోనే పేలిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇతనితోపాటు మరో ఇద్దరు తీవ్రవాదులు కూడా అక్కడే మరణించారు. బాంబు పేలిన సమాచారాన్ని అందుకుని అక్కడకు చేరుకున్న పాకిస్థాన్ భద్రతాదళాలు మరణించింది. ప్రఖ్యాత తీవ్రవాది మహ్మద్ సయీద్ అని తెలుసుకుని, ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశారు. అయితే తమ చీఫ్ మరణించారన్న విషయం మీద ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ఎలాంటి స్పందననూ తెలియజేయలేదు.