కోర్టులో 30రౌండ్ల కాల్పులు.. ముగ్గురు మృతి
posted on Jun 3, 2015 11:42AM

ఒక పక్క కోర్టులో విచారణ జరుగుతోంది.. ఇంతలో ఇద్దరు దుండగులు అమాంతంగా కోర్టు హోలులోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం అనేక అక్రమాలకు పాల్పడిన కేసులో సుశీల్ శ్రీవాస్తవ్ అనే కరుడుగట్టిన ఓ ముఠా నాయకుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఐదేళ్లుగా విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా శ్రీవాస్తవ కోర్టులో హాజరుకాగా ఇద్దరు దుండగులు కోర్టు హాలులోకి ప్రవేశించి వారి దగ్గరున్న ఏకే 47 తుపాకులతో కాల్పులు జరపగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రౌండ్ల తూటాలు బయటకొచ్చాయి. ఈ కాల్పుల్లో శ్రీవాస్తవ్ తోపాటు అతని సన్నిహితులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.