‘వైఎస్ మనుషులందరిపైనా ఏసిబి దాడి చేయాలి’

 

 

 

 

దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి హయాంలో కీలక పదవుల్లో ఉన్నవారందరిఫైనా ఏసిబి దాడులు చేయించాలని, వారి ఆస్తులఫైన విచారణ చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 

రాజ శేఖర రెడ్డి హయాంలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో సభ్యునిగా నియమితులైన రిపున్జయ్ రెడ్డి నాలుగేళ్లలో వందల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారని ఆయన ఆరోపించారు. అలాగే, వైఎస్ పాలనలో ముఖ్య పదవుల్లో ఉన్న అధికారులఫైన కూడా కన్నేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు కూడా ఆ సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

 

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ ప్రైవేటు వ్యక్తులకు సహకరించిన విషయంలో ప్రభుత్వానికి నివేదిక అందినప్పటికీ చర్య ఎందుకు తీసుకోలేదని విహెచ్ ప్రశ్నించారు.