జయ ఆరోగ్యం గురించి మాట్లాడితే నాలుక కోస్తా.. పీ.ఆర్
posted on Jul 20, 2015 11:56AM

గత పదిరోజుల క్రితం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం బాలేదంటూ.. ఆమె ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు జోరుగా షికార్లు చేశాయి.. ఆ విషయం తెలిసిందే. జయలలితకు ఆరోగ్య సరిగా లేదని.. ఆమె తీవ్రమైన మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారని.. అందుకే పదవికి ప్రమాణస్వీకారం చేసినా కూడా ఎక్కువగా ఇంట్లో ఉండే బాధ్యతలు నిర్వహిస్తున్నారని పలు వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై ప్రతిపక్షనేతలు కూడా జయలలిత ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలంటూ వాదనలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే ఎంపీ పీ.ఆర్ తీవ్రంగా మండిపడ్డారు. జయలలితకు ఆరోగ్యం బాలేదని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి తప్పుడు సంకేతాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇంకోసారి అమ్మ ఆరోగ్యంపై ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తానని హెచ్చరించారు. కాగా కేంద్రంలో భూసేకరణ చట్టం ఆమోదం కోసం ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా జయలలిత మద్దతు కోరారని, అమ్మ మద్దతిస్తే చట్టం సులభంగా ఆమోదం పొందుతుందని అన్నారు. కాగా తన ఆరోగ్యపై తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించిన జయలలిత రెడిఫ్ వెబ్సైట్పై జయలలిత పరువునష్టం దావా కూడా వేశారు.