13 అంబులెన్సులను ప్రారంభించిన చంద్రబాబు, అమిత్ షా..

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఈరోజు ఉదయం హైదరాబాదు నుంచి గన్నవరం చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద 13 అంబులెన్సులను ప్రారంభించారు. ఏపీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ అంబులెన్సులను తన ఎంపీ లాడ్స్ నిధులతో కొనుగోలు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరీ, సురేష్‌ ప్రభు హాజరయ్యారు.