టీడీపీకి మరో దెబ్బ... ప్రజా వేదికను స్వాధీనం చేసుకున్న జగన్ ప్రభుత్వం!!

 

టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉండవల్లిలోని ప్రజావేదికను జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఉండవల్లిలో చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ఈ ప్రజా వేదికను తమకు కేటాయించాలని గతంలో జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అయితే ఈ లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజా వేదికను స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయించింది.

ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రజావేదికను స్వాధీనం చేసుకోడానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్డీయే అధికారులు ప్రజావేదిక వద్దకు వచ్చి పరిశీలించారు. టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకుని వెళ్లాలని నేతలకు సీఆర్డీయే అధికారులు సూచించారు

కాగా చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రజావేదిక భవనాన్ని స్వాధీనం చేసుకోవడం సరికాదని టీడీపీ నేతలు అన్నారు.