టెలీకాం సర్వీస్ ప్రొవైడర్లకు సిట్ నోటీసులు జారీ?

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం (సిట్) హైదరాబాద్ లోని 12 మొబైల్ సర్వీస్‌ ప్రొవైడర్లకు శనివారం నోటీసులు జారీ చేసింది. గత నెల రోజుల కాల్ డాటా, మరికొన్ని ఇతర రికార్డ్స్ లతో ఈరోజు విజయవాడలో భవానీపురం పోలీస్ స్టేషన్ లో తమ ముందు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చేరు. రికార్డులను తారుమారు ప్రయత్నం చేసినట్లయితే కటిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఎవరెవరి ఫోన్లను ఎవరు ట్యాపింగ్ చేయించారు?ఎప్పుడెప్పుడు ట్యాపింగ్ చేసారు?ఎందుకు చేయించారు? ఎటువంటి వివరాలను సేకరించారు?వంటి ప్రశ్నలకు వారి నుండి సమాధానం రాబట్టవచ్చును. వారిచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.