political-news-img

అక్కా రజనక్కా...నీ క‌ష్టం ఊర‌కే పోదు!

ఏంటీ కామెంట్ కి అర్ధం? అని చూస్తే.. రాంబాబు గుంటూరు ఇష్యూలో గ‌ల్లా మాధ‌వి ఎంత ఫేమ‌స్ అయ్యారో అంత‌క‌న్నా మించి ఫేమ‌స్ కావాల‌నుకున్న ర‌జ‌న‌క్క‌.. జ‌గ‌న్ అంబ‌టి ప‌రామర్శ‌ టూర్ బాద్య‌త‌ల‌న్నీ చూశారు. ఇందుకు గానూ ఆమెకు అయిన ఖ‌ర్చు ఏకంగా ఇర‌వై కోట్ల రూపాయ‌ల‌ట‌. ఆ స్థాయిలో ఆమె జ‌గ‌న్ టూర్ ఏర్పాట్లు ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి ప‌ర్య‌వేక్షించారు. జ‌గ‌న్ రాగానే కొట్ట‌డానికి గుమ్మ‌డి కాయ‌లు ఇవ్వ‌డం మాత్ర‌మే కాదు.. అలా కొట్టినందుకు ఒక్కో మ‌హిళ‌కు 500 రూపాయ‌లిచ్చారామె. అదీ ర‌జ‌న‌క్క అంటే. ఇంత‌కీ ఈ ఇర‌వై కోట్ల వ్య‌యానికి గానూ జ‌గ‌న్ నుంచి ఆమెకు వ‌చ్చిన ప్ర‌తిఫ‌లం.. గూంటూరు టూర్ లో ర‌జ‌న‌మ్మ అంటూ ఒక మాట ఆయ‌న నోటి నుంచి జాలువార‌డం. అంతా బాగుంది కానీ ఇప్ప‌టికే వ‌రుస కేసుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు ర‌జ‌న‌క్క‌. చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టుగా మొన్నా మ‌ధ్య జైలుకు వెళ్లాల్సింది తృటిలో మిస్ అయ్యింది. ఇక కేసుల పరంప‌ర అయితే ఆగ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాల్లో త‌మ పార్టీగానీ వ‌స్తే.. అంటూ ఆమె బెదిరింపులు కూడా ఎంత మాత్రం త‌గ్గ‌డం లేదు. ఓకే. జ‌గ‌న్ వచ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం అటుంచితే అస‌లు ర‌జ‌న‌క్క‌కు ఉన్న వ్య‌తిరేక‌త‌ను బ‌ట్టీ చూస్తే.. చిల‌క‌లూరిపేట‌లో ఈ సారికి టికెట్ వ‌స్తుందా? అన్న అనుమాన‌ముంది. ఎందుకంటే తాను ఎమ్మెల్యేగా ఉండ‌గా.. సొంత పార్టీ నేత‌ల‌ను కూడా వ‌ద‌ల‌కుండా వ‌సూళ్ల‌తో వేధించిన గ‌తం ర‌జ‌న‌క్క‌ది. అందుకే జ‌గ‌న్ ఆమె స్థానం మార్చారు. బై బ్యాడ్ ల‌క్ అక్క‌డా ర‌జ‌న‌మ్మ ఆశ‌లు నెర‌వేరాయా అంటే అదీ లేదు. దీంతో తిరిగి చిల‌క‌లూరిపేటే కావాల‌ని ఆమె ట్రై చేశారు. అయితే జ‌గ‌న్ ఎంత‌కీ ఒప్పుకోక పోయే స‌రికి ఇటీవ‌ల అలిగి పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక ఆఖ‌రి ఛాన్స్ అన్న‌ట్టు జ‌గ‌న్ గుంటూరు ర్యాలీ బాధ్య‌త‌ల‌న్నీ ర‌జ‌న‌క్క ఇర‌వై కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి మ‌రీ చూస్కున్నారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. ఈ లెక్క‌న గ‌త జ‌గ‌న్ పాల‌న‌లో అక్క వ‌సూళ్ల రేంజ్ ఏంటో ఈ 20 కోట్ల ఖ‌ర్చే చెప్ప‌క చెబుతోంద‌ని చ‌తుర్లు విసురుతున్నారు కొంద‌రు. ఏది ఏమైనా ఆల్ ద బెస్ట్ ర‌జ‌న‌క్క.. హోప్ ద బెస్ట్. మీకు టికెట్ రావాల‌నే ఆశిద్దామ‌ని సెటైర్లు వేస్తున్నారు చాలా మంది వైసీపీ కార్య‌కర్త‌లు.

Publish Date: Feb 6, 2026 10:09PM

political-news-img

హమ్మయ్య...పెద్దపులిని పట్టేశారు

తూర్పుగోదావరి జిల్లాలో 17 రోజులుగా హడలెత్తిస్తున్న పెద్దపులిని ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం కృష్ణయ్య కాలనీ సమీప పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమైవెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆరు రోజులుగా పులి దాడుల్లో పశువులు మృతిచెందడంతో, ప్రజల భద్రత దృష్ట్యా అటవీ శాఖ ‘ఆపరేషన్ టైగర్’ని చేపట్టారు. మొత్తానికి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి పులిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి పులిని సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పులి స్పృహ కోల్పోయిందని.. బోన్లో సురక్షితంగా బంధించి విశాఖకు తరలించినట్లు చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి నేతృత్వంలో నిర్వహించారు. అనుభవజ్ఞులైన సిబ్బంది.. పొలాలు, అటవీ ప్రాంతాలు, పశువులపై దాడులు జరిగిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టి పులి ఆచూకీ కనుగొన్నారు. పూణే నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల బృందం రాజమహేంద్రవరానికి చేరుకుని ‘ఆపరేషన్ టైగర్’ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. 17 రోజుల తర్వాత పులిని బంధించడంతో స్థానికులు, అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Publish Date: Feb 6, 2026 9:56PM

political-news-img

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్

గత రెండు రోజులుగా కొనసాగిన కాల్పుల్లో మొత్తం 7 మంది మావోయిస్టులు హతమయ్యారని గడ్చిరోలి జిల్లా పోలీసులు అధికారికంగా వెల్లడించారు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ కీలక మావోయిస్టు నేత కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో గడ్చిరోలి డివిజన్ కమిటీ ఇన్‌చార్జ్, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్, CPI (మావోయిస్టు) 10వ నంబర్ కంపెనీ ఇన్‌చార్జ్ ప్రభాకర్ ఉన్నారని వెల్లడించారు. ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా నివాసిగా పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌పై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించిందని అధికారులు తెలిపారు. అతడితో పాటు మరో ఆరు మంది హార్డ్‌కోర్ మావోయిస్టులు కూడా ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు.ఇప్పటికే మూడు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించగా, తాజాగా మరో నాలుగు మృతదేహాల గుర్తింపు పూర్తయినట్లు తెలిపారు. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా, గడ్చిరోలి అటవీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టు కార్యకలాపాలపై ఈ ఎన్‌కౌంటర్ కీలక దెబ్బగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు

Publish Date: Feb 6, 2026 9:44PM

political-news-img

కుర్రాళ్లు కుమ్మేశారు...అండర్-19 విశ్వవిజేతగా భారత్

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా 100 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 412 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్‌ జట్టు 40.2 ఓవర్లలో 311 పరగులకు ఆలౌట్ అయింది. 177 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయినా..ఫాల్క్‌నర్ సెంచరీతో చేశాడు. డాక్సిన్స్ (66) మేయేస్ 45 పరుగులతో రాణించాడు. భారత్ బౌలర్లలో అంబరీశ్3, దేవేంద్ర, చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సెమీఫైనల్ సెంచరీ హీరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (9) కేవలం 20 రన్స్‌కే ఔటయ్యాడు. ఈ దశలో వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. సూర్యవంశీ తన తుపాను ఇన్నింగ్స్‌లో కేవలం 80 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేశాడు. మరోవైపు, కెప్టెన్ ఆయుష్ మాత్రే (51 బంతుల్లో 53) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 142 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్‌కు సూర్యవంశీ 89 రన్స్ చేశారు.. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్‌కు చేరిన భారత్.. ఆరోసారి టైటిల్‌ను ముద్దాడింది.

Publish Date: Feb 6, 2026 9:15PM

political-news-img

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే మోరిలో వేసినట్లే : కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే వారి ప్రజా వ్యతిరేక విధానాలకు, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యానికి, మరియు వారు చేసిన 420 వాగ్దానాల మోసానికి మద్దతు ఇవ్వడమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మొండి వైఖరిని వీడాలంటే, ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా వేములవాడ మరియు సిరిసిల్ల ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్, ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే అడ్డుకోకపోతే, ఆ పార్టీ మరింత రెచ్చిపోయి ప్రజలను పీడిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే అవినీతి, అక్రమాలు మరియు స్కాములతో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా, భారతీయ జనతా పార్టీపై కూడా ఆయన మండిపడుతూ, బీజేపీకి ఓటు వేయడం అంటే అది వృథా చేయడమేనని, మీ ఓటు మోరిలో వేసినట్లే అన్నారు. ఆ పార్టీ కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కులమతాల పేరుతో ఓట్లు వేయించుకొని, ఒట్టు పెట్టించుకుని పదవులు పొంది మాయమవుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై విమర్శలు చేస్తూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు లేదా తెలంగాణ రాష్ట్రానికి ఆయన సాధించిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని, సిరిసిల్ల నేతన్నలు ఎంతో కాలంగా కోరుతున్న మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకువచ్చే శక్తి ఆ పార్టీకి లేదని విమర్శించారు. బీజేపీ కేవలం కులమత రాజకీయాలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 రూపాయలు మరియు 400 రూపాయల పెన్షన్ వంటి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సిరిసిల్లలో బతుకమ్మ చీరల తయారీని రద్దు చేసి నేతన్నల ఉపాధిని దెబ్బతీశారని, నేతన్నలను అవమానపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు. నేతన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వారిని కండోమ్స్ అమ్ముకోండి…పాపడాలు అమ్ముకోండి అంటూ నీచమైన మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు చెప్పుతో కొట్టినట్లు ఎన్నికల్లో సమాధానం చెప్పాలన్నారు. చివరగా, సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లా ఉనికికే ప్రమాదమని కేటీఆర్ హెచ్చరించారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చే కొద్దిపాటి డబ్బులకు లోబడకుండా, మన సొంత పార్టీ అయిన భారత రాష్ట్ర సమితిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Publish Date: Feb 6, 2026 8:41PM

political-news-img

బూత్ స్థాయి నుంచి టీడీపీ పునర్నిర్మాణం చేస్తాం : మంత్రి లోకేష్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు. టీం 11 కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, బాబాయి హత్యకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిందని తీవ్రంగా విమర్శించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రూ.250 కోట్లు దోచేశారని, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచే పార్టీని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, బూత్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని చెప్పారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో ఏపీకి 25 శాతం వస్తోందని, విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వ స్థిరత్వం అవసరమని, కార్యకర్తలంతా బాధ్యతతో పనిచేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

Publish Date: Feb 6, 2026 7:38PM

News Videos

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img