వెజిటబుల్ సాంబార్

 

 

 

కావలిసినవి:

కందిపప్పు - 200 గ్రాములు

వంకాయలు -2

బెండకాయలు -6

మునక్కాడ -1

ఉల్లిపాయ - 3 చిన్నవి

దోసకాయ -1

టమాటో -2

పచ్చిమిర్చి - 4

చింతపండు - 50 గ్రాములు

పసుపు -1/2 స్పూన్

నూనె - సరిపడా

ఆవాలు , జీలకర్ర,మెంతులు, - సరిపడా

ఎండు మిర్చి,కరివేపాకు - తలింపుకు సరిపడా

వెల్లుల్లి - 4

ఇంగువ: చిటికెడు

సాంబార్ పొడి -1 స్పూన్

కొత్తిమీర -కొంచం

ఉప్పు - సరిపడ

 

తయారు చేసే విధానం:

ముందుగా అన్ని కూరగయలని కడిగి పొడవుగా కట్ చేసుకుని,కందిపప్పును నీళ్ళు పోసి మరొక గిన్నెలో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను ఉల్లిపాయలు కూడా వేసి ఉడికించాలి.

ఉడికిన పప్పు కూరగాయ ముక్కలలో చింతపండు రసం,ఒక గ్లాస్ నీళ్ళు ,ఉప్పు కారం , ఇంగువ వేసి బాగా మరిగించాలి

మరిగిన తరువాత చివరిలో సాంబార్ పొడి వేసుకోవాలి.ఇప్పుడు గిన్నెపెట్టుకుని ఆయిల్ వేసి వేల్లిలిని కొంచం చితకొట్టి వేయించాలి.

తరువాత ఎండుమిర్చి, జీలకర్ర,ఆవాలు ,మెంతులు ,కరివేపాకు వేసి చిటపటలాడిన తరువాత మరిగించిన సాంబార్ లో ఈ తాలింపుని వేసుకుని చివరిలో కొత్తిమిర వేసుకోవాలి.