సగ్గుబియ్యం సేమ్యా

 

తయారు చేసే విధానం: గిన్నెలో నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆ తర్వాత అందులో సేమ్యా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఆ తరవాత అదే గిన్నెలో సగ్గు బియ్యం వేసి ఫ్రై చేసుకొని అందులో పాలు పోసి కాసేపటి వరకు మరగనిచ్చి ఆ తరవాత అందులో చెక్కెర వేయాలి, అది కరిగేలోపు ఇంకో గిన్నెలో జీడి పప్పు, ఎండు ద్రాక్ష ఫ్రై చేసుకోవాలి. ఆ తరవాత మరిగిన పాలలో ఫ్రై చేసుకున్న సేమ్యా, వేసి కాసేపు ఉడికాక బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేసి సర్వ్ చేసుకోవాలి.

 

రాజ్మా మసాల

 

తయారు చేసే విధానం : ముందుగా, బంగాళా దుంపలు, రాజ్మా కలిపి ఉడకబెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసి, అది కాగాక చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొని టమాటాలు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరవాత అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రాజ్మా , స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళా దుంప, కారం వేసి కలిపి కాసేపు మగ్గనిచ్చి, అందులో ఆంచూర్ పౌడర్, ఉప్పువేసి కాసేపు ఉడకనిచ్చి, చివరలో చాట్ మసాల వేసి దించేసి కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.